బంగ్లాదేశ్ లో ఉగ్రదాడి, 20 మంది మృతి
- July 02, 2016
బంగ్లాదేశ్లో ఐసిస్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఉగ్రదాడిలో 20 మంది మృతి చెందారు. మృతుల్లో ఒకరు భారతీయ మహిళ ఉన్నారు. మరో 13 మంది బందీలను సురక్షితంగా విడిపించారు. 10 గంటలపాటు జరిగిన ఆపరేషన్లో ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఓ ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. ముష్కరుల దాడిని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఢాకా రెస్టారెంట్లో ముగిసిన సైనిక ఆపరేషన్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బందీలను విడిపించేందుకు 10 గంటల పాటు సాగిన సైనిక ఆపరేషన్ ముగిసింది. ఉగ్రదాడిలో 20 మంది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఎక్కువ శాతం జపాన్, ఇటలీకి చెందినవారున్నారు. విదేశీయులతో పాటు మొత్తం 13 మంది బందీలను భద్రతా బలగాలు సురక్షితంగా విడిపించ గలిగాయి. ఆరుగురు ఉగ్రవాదులు హతం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించే క్రమంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ముష్కరులు తమ ఆధీనంలో ఉన్న బందీలపై కాల్పులు జరపకుండా పదునైన ఆయుధంతో చంపినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది విదేశీయులున్నట్లు బ్రిగేడియర్ జనరల్ చౌదరి తెలిపారు.దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిప్ ప్రకటన ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసంలో ఉగ్రవాదులు మానవ హననానికి పాల్పడడాన్ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు హింస తప్ప మతంపై విశ్వాసం లేదన్నారు.రెస్టారెంట్ లోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు కట్టుదిట్టమైన భద్రత ఉండే గుల్షన్ ప్రాంతంలోని హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్లోకి శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నరకు ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. రెస్టారెంట్ సిబ్బందితో పాటు పలువురు విదేశీ పర్యాటకులతో పాటు మొత్తం 20 మందిని బందీలుగా చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు రెస్టారెంట్ను చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి. భద్రతా బలగాలు, సాయుధ ఉగ్రవాదులకు మధ్య 11 గంటలపాటు భీకర పోరు జరిగింది. హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్కు ఎక్కువ మంది విదేశీయులే రావడంతో ఉగ్రవాదులు దీన్ని టార్గెట్ చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







