అరెస్టు అయిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ

- July 02, 2016 , by Maagulf
అరెస్టు అయిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ

హైదరాబాద్‌లో అరెస్టు అయిన ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కస్టడీలోకి తీసుకుంది. ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఐఏ విచారణలో.. ఇక్బాల్ యజ్దాని గతంలో సిరియా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారణ అయింది. మధ్య తూర్పు దేశాల నుంచి నిధులు వచ్చినట్లు వెల్లడైంది. హవాలా, మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీల ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందినట్లు గుర్తించారు. సిరియాలోని షఫీఅర్మర్‌తో మెయిల్, చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కుట్రలో మరికొందరికి ప్రమేయం ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com