తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం
- February 20, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు. 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా రాష్ట్రాలకు ఈ నిధులను అందజేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గత కొంతకాలంగా వరదలు, తుఫానులు, భారీ వర్షాల వల్ల తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో గోదావరి, కృష్ణా నదుల్లో వచ్చిన వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి, వేలాది కుటుంబాలు తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇదే విధంగా, తెలంగాణలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లకు, రహదారులకు, వంతెనలకు భారీగా నష్టం జరిగింది. ఈ నిధులు మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు, పునర్నిర్మాణ పనులకు ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









