సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: హోంమంత్రి అనిత
- February 21, 2025
అమరావతి: చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. విజయవాడలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు,సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో కలిసి హోంమంత్రి అనితకు వినతిపత్రం అందించారు.చిట్ ఫండ్ మోసంలో సుమారు రూ.200 కోట్ల మేర ప్రజలు నష్టపోయారని ఎమ్మెల్యే తెలిపారు.బాధితుల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని..వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.స్పందించిన హోంమంత్రి అనిత..ఘటనలో నిందితుడ్ని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









