సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: హోంమంత్రి అనిత

- February 21, 2025 , by Maagulf
సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: హోంమంత్రి అనిత

అమరావతి: చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. విజయవాడలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు,సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో కలిసి హోంమంత్రి అనితకు వినతిపత్రం అందించారు.చిట్ ఫండ్ మోసంలో సుమారు రూ.200 కోట్ల మేర ప్రజలు నష్టపోయారని ఎమ్మెల్యే తెలిపారు.బాధితుల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని..వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.స్పందించిన హోంమంత్రి అనిత..ఘటనలో నిందితుడ్ని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని  హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com