సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: హోంమంత్రి అనిత
- February 21, 2025
అమరావతి: చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. విజయవాడలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు,సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో కలిసి హోంమంత్రి అనితకు వినతిపత్రం అందించారు.చిట్ ఫండ్ మోసంలో సుమారు రూ.200 కోట్ల మేర ప్రజలు నష్టపోయారని ఎమ్మెల్యే తెలిపారు.బాధితుల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని..వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.స్పందించిన హోంమంత్రి అనిత..ఘటనలో నిందితుడ్ని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- 'ఇన్నర్ టెంపుల్' గౌరవ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు
- బహ్రెయిన్లో ప్రమాదానికి గురైన భారతీయ మహిళ స్వదేశానికి తరలింపు
- ఖతార్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు
- విమానాలలో పవర్ బ్యాంక్లపై సౌదీ అరేబియా నిషేధం..!!
- కువైట్లో ఎబోలా కేసులు లేవు..సరిహద్దుల వద్ద గట్టి భద్రత..!!
- బహ్రెయిన్ లో ప్రవాసుల కోసం వైద్య శిబిరం..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- హోర్ముజ్లో ఇరాన్కు కొత్త అధికారాన్ని తిరస్కరించిన గల్ఫ్ దేశాలు..!!
- అభివృద్ధికి మద్దతు..ఒమన్ లో కొత్త పట్టణ ప్రణాళిక చట్టం..!!
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)









