సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: హోంమంత్రి అనిత
- February 21, 2025
అమరావతి: చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. విజయవాడలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు,సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో కలిసి హోంమంత్రి అనితకు వినతిపత్రం అందించారు.చిట్ ఫండ్ మోసంలో సుమారు రూ.200 కోట్ల మేర ప్రజలు నష్టపోయారని ఎమ్మెల్యే తెలిపారు.బాధితుల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని..వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.స్పందించిన హోంమంత్రి అనిత..ఘటనలో నిందితుడ్ని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







