భారత దేశంలో 7 వేల కోట్ల 'లులు' పెట్టుబడులు
- July 03, 2016
ఎఫ్డిఐ విషయంలో భారత ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాట్ల నేపథ్యంలో లులు గ్రూపు 7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని లులు గ్రూపు అధిపతి యూసుఫ్అలి చెప్పారు. హాస్పిటాలిటీ, రిటైల్ సెక్టార్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. కేరళలో 4,650 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 1,000 కోట్లు, అలాగే తెలంగాణలో 1,410 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది లులు గ్రూపు. ఎన్డిఏ ప్రభుత్వం ఎఫ్డిఐల వెసులుబాటు కల్పించడంతో దేశంలోకి సుమారు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రవాహం వస్తుందని లులు గ్రూపు అధిపతి అంచనా వేశారు. ఇదంతా కేవలం గల్ఫ్ కంట్రీల నుంచి వచ్చే పెట్టుబడుల అంచనాయేనని ఆయన అన్నారు. లులు గ్రూపు కొచ్చిలో ఐటి పార్క్ని 1,400 కోట్లతో ఏర్పాటు చేయనుంది. తిరువనంతపురంలో షాపింగ్ మాల్ మరియు ఫైవ్స్టార్ హోటల్ని నిర్మించనుంది 1,250 కోట్లతో. తెలంగాణలో 500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 900 కోట్లతో షాపింగ్ మాల్ని లులు గ్రూప్ ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









