భారత దేశంలో 7 వేల కోట్ల 'లులు' పెట్టుబడులు
- July 03, 2016
ఎఫ్డిఐ విషయంలో భారత ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాట్ల నేపథ్యంలో లులు గ్రూపు 7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని లులు గ్రూపు అధిపతి యూసుఫ్అలి చెప్పారు. హాస్పిటాలిటీ, రిటైల్ సెక్టార్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. కేరళలో 4,650 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 1,000 కోట్లు, అలాగే తెలంగాణలో 1,410 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది లులు గ్రూపు. ఎన్డిఏ ప్రభుత్వం ఎఫ్డిఐల వెసులుబాటు కల్పించడంతో దేశంలోకి సుమారు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రవాహం వస్తుందని లులు గ్రూపు అధిపతి అంచనా వేశారు. ఇదంతా కేవలం గల్ఫ్ కంట్రీల నుంచి వచ్చే పెట్టుబడుల అంచనాయేనని ఆయన అన్నారు. లులు గ్రూపు కొచ్చిలో ఐటి పార్క్ని 1,400 కోట్లతో ఏర్పాటు చేయనుంది. తిరువనంతపురంలో షాపింగ్ మాల్ మరియు ఫైవ్స్టార్ హోటల్ని నిర్మించనుంది 1,250 కోట్లతో. తెలంగాణలో 500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 900 కోట్లతో షాపింగ్ మాల్ని లులు గ్రూప్ ఏర్పాటు చేయనుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







