దొంగతనం కేసులో ఐదుగురికి జైలు

- July 03, 2016 , by Maagulf
దొంగతనం కేసులో ఐదుగురికి జైలు

ఓ విల్లాలోకి అక్రమంగా ప్రవేశించి 945,000 దిర్హామ్‌ల నగదు, విలువైన వస్తువుల్ని దొంగతనం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు మూడేళ్ళ జైలు శిక్ష పడింది. చైనా నుంచి వచ్చిన ఈ పర్యాటకుల వయసు 24 నుంచి 37 ఏళ్ళు. ఉమ్‌ సకెమ్‌లో అర్థరాత్రి దొంగతనం చేశారు. జులై 2015లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన సమయంలో తాము యూఏఈలో లేమని నిందితులు పేర్కొన్నారు. విల్లా ఓనర్‌ మాట్లాడుతూ, ఇంట్లోకి వెళ్ళే సరికి అంతా చిందరవందరగా కనిపించిందనీ, విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని, నగదు సహా విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు, దొంగతనానికి గురైన వస్తువుల్ని గుర్తించాలని కోరారని, తాను వెళ్ళి తన వస్తువుల్ని గుర్తించానని ఆయన అన్నారు. న్యాయస్థానం విధించిన శిక్షపై నిందితులు 10 రోజుల్లోగా అపీల్‌ చేసుకునే వీలుంది. 


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com