దొంగతనం కేసులో ఐదుగురికి జైలు
- July 03, 2016
ఓ విల్లాలోకి అక్రమంగా ప్రవేశించి 945,000 దిర్హామ్ల నగదు, విలువైన వస్తువుల్ని దొంగతనం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు మూడేళ్ళ జైలు శిక్ష పడింది. చైనా నుంచి వచ్చిన ఈ పర్యాటకుల వయసు 24 నుంచి 37 ఏళ్ళు. ఉమ్ సకెమ్లో అర్థరాత్రి దొంగతనం చేశారు. జులై 2015లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన సమయంలో తాము యూఏఈలో లేమని నిందితులు పేర్కొన్నారు. విల్లా ఓనర్ మాట్లాడుతూ, ఇంట్లోకి వెళ్ళే సరికి అంతా చిందరవందరగా కనిపించిందనీ, విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని, నగదు సహా విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు, దొంగతనానికి గురైన వస్తువుల్ని గుర్తించాలని కోరారని, తాను వెళ్ళి తన వస్తువుల్ని గుర్తించానని ఆయన అన్నారు. న్యాయస్థానం విధించిన శిక్షపై నిందితులు 10 రోజుల్లోగా అపీల్ చేసుకునే వీలుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







