కేంద్ర మంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ..

- March 05, 2025 , by Maagulf
కేంద్ర మంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ..

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ సెక్రటేరియట్ ఫస్ట్ బ్లాక్‌లోని కేబినెట్ హాల్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com