యూపీఐ ద్వారా ఈపీఎఫ్ నగదు విత్ డ్రా
- March 06, 2025
న్యూ ఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి (EPF) నుంచి నగదు విత్ డ్రా మరింత సులభతరం కానుంది. బ్యాంక్ ఖాతాల నుంచి ఈపీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా నగదు ఉపసంహ రించుకునే సదుపాయం కల్పించనున్నారు. ప్రస్తుతం పీఎఫ్ నగదును విత్ డ్రా చేయాలంటే చాలా సమయం పడుతుంది. తిరస్కరణకు కూడా గురవుతుంటాయి. ఈ నేపధ్యంలోనే నగదు విత్ డ్రాను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకు వస్తోంది. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఇటీవల ప్రకటించారు. జూన్ నాటికి ఈ సదుపాయం అందుబా టులోకి వస్తుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ ను ఉపసంహరించుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ (NPCI) తో ఈపీఎఫ్ ఓ చర్చలు జరుపుతోంది. ఈ సంవత్సరం మే, జూన్ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









