యూపీఐ ద్వారా ఈపీఎఫ్ నగదు విత్ డ్రా
- March 06, 2025
న్యూ ఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి (EPF) నుంచి నగదు విత్ డ్రా మరింత సులభతరం కానుంది. బ్యాంక్ ఖాతాల నుంచి ఈపీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా నగదు ఉపసంహ రించుకునే సదుపాయం కల్పించనున్నారు. ప్రస్తుతం పీఎఫ్ నగదును విత్ డ్రా చేయాలంటే చాలా సమయం పడుతుంది. తిరస్కరణకు కూడా గురవుతుంటాయి. ఈ నేపధ్యంలోనే నగదు విత్ డ్రాను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకు వస్తోంది. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఇటీవల ప్రకటించారు. జూన్ నాటికి ఈ సదుపాయం అందుబా టులోకి వస్తుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ ను ఉపసంహరించుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ (NPCI) తో ఈపీఎఫ్ ఓ చర్చలు జరుపుతోంది. ఈ సంవత్సరం మే, జూన్ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







