కువైట్ ప్రైవేట్ రంగంలో పెరిగిన విదేశీ ఉద్యోగుల సంఖ్య..!!
- March 07, 2025
కువైట్: కువైట్ ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల శాతం పెరిగిందని తాజా కార్మిక మార్కెట్ డేటా వెల్లడించింది.అయితే కువైట్ పౌరుల నిష్పత్తి స్థిరంగా ఉంది.సెంట్రల్ స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన త్రైమాసిక కార్మిక మార్కెట్ నివేదిక ప్రకారం, మొత్తం కార్మిక మార్కెట్లో కువైట్ కార్మికులు 20.6% మంది ఉండగా, కువైటీయేతరులు 79.4% మంది ఉన్నారు
ప్రభుత్వ రంగంలో కువైట్ పౌరులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.వీరు మొత్తం శ్రామిక శక్తిలో 79.5% మంది, 375,800 మంది ఉద్యోగులు ఉన్నారు.అదే సమయంలో ప్రైవేట్ రంగంలో వారి సంఖ్య 4.4% వద్ద మారలేదు.మొత్తం 75,538 మంది ఉద్యోగులు ఉన్నారు.సెప్టెంబర్ 2024 వరకు డేటా ఆధారంగా..ప్రైవేట్ రంగంలో ప్రవాస కార్మికుల పై నిరంతర ఆధారపడటాన్ని హైలైట్ చేస్తుంది.
ప్రభుత్వ శ్రామిక శక్తిలో 3.9% మంది విదేశీయులు ఉండగా, ప్రైవేట్ రంగంలో వారి ప్రాతినిధ్యం 66.2% గా ఉంది.దేశంలోని మొత్తం కువైటీయేతర కార్మికుల సంఖ్య సెప్టెంబర్ 2024లో 1,738,056కి చేరుకుంది.ఇది సెప్టెంబర్ 2023లో 1,658,659 గా ఉంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









