ICC Champions Trophy: హై-వోల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధం..
- March 09, 2025
దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఎంతో ఉత్కంఠభరితంగా, క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది.
భారత్-న్యూజిలాండ్ జట్లు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి. హోరాహోరీగా సాగనున్న మెగా ఫైనల్ ఫైల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. ఈ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 కి ప్రారంభం కానుంది వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా ఫైనల్ లో గెలిచి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో టీమిండియా ఐదోసారి అడుగుపెట్టింది. టీమిండియా ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్స్లో ఆడగా రెండు సార్లు టైటిల్తో స్వదేశానికి తిరిగొచ్చింది. దుబాయ్ వేదిక ఇప్పుడు ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో తలపడనుంది.
మరోవైపు సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టిన కివీస్ ఛాంపియన్ ట్రోఫీపై కన్నేసింది. అయితే, ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ – న్యూజిలాండ్ తలపడటం ఇది మూడోసారి. గత రెండు ఫైనల్స్లోనూ కివీస్ భారత్పై గెలిచింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







