ICC Champions Trophy: హై-వోల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధం..
- March 09, 2025
దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఎంతో ఉత్కంఠభరితంగా, క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది.
భారత్-న్యూజిలాండ్ జట్లు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి. హోరాహోరీగా సాగనున్న మెగా ఫైనల్ ఫైల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. ఈ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 కి ప్రారంభం కానుంది వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా ఫైనల్ లో గెలిచి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో టీమిండియా ఐదోసారి అడుగుపెట్టింది. టీమిండియా ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్స్లో ఆడగా రెండు సార్లు టైటిల్తో స్వదేశానికి తిరిగొచ్చింది. దుబాయ్ వేదిక ఇప్పుడు ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో తలపడనుంది.
మరోవైపు సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టిన కివీస్ ఛాంపియన్ ట్రోఫీపై కన్నేసింది. అయితే, ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ – న్యూజిలాండ్ తలపడటం ఇది మూడోసారి. గత రెండు ఫైనల్స్లోనూ కివీస్ భారత్పై గెలిచింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







