దేశవ్యాప్తంగా 47 ఇండిగో విమానాలు రద్దు
- March 12, 2018ముంబై : పౌర విమాన శాఖ కఠిన నిర్ణయం తీసుకున్నది. దీంతో ఏ320నియోస్ విమానాలు గ్రౌండ్ అయ్యాయి. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లు ఉన్న విమానాలను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అకస్మాత్తుగా నిర్ణయించింది. ఈ కారణంగా ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా 47 విమానాలను రద్దు చేసింది. గోఎయిర్కు సంబంధించిన మరో మూడు విమానాలను కూడా రద్దు చేశారు. 47 విమానాలను నిలిపేసినట్లు ఇండిగో ఇవాళ నత వెబ్సైట్లో పేర్కొన్నది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, బెంగుళూర్, పాట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గౌహతిల నుంచి ప్రారంభం అయ్యే విమానాలను రద్దు చేశారు. సోమవారం అకస్మాత్తుగా ఇండిగో విమానం ఒకటి గాల్లోనే తీవ్ర వడిదిడుకులకు లోనైంది. దీంతో డీజీసీఏ తక్షణం అలాంటి విమానాలను రద్దు చేయాలని ఆదేశించింది. ఇంజిన్ సమస్యలు ఉన్న ఏ320నియో ప్లేన్లను ఫిబ్రవరిలోనే గ్రౌండ్ చేశారు. విమానాలను ల్యాండ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు. దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ ప్రతి రోజు సుమారు వెయ్యి సర్వీసులను నడుపుతున్నది.
తాజా వార్తలు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా