ఒమన్ ఈద్ సెలబ్రేషన్స్..కొత్త డెస్టినేషన్లకు ఉత్తర్వులు..!!
- March 18, 2025
మస్కట్: రాబోయే ఈద్ సెలవులకు ఒమన్ సిద్ధమవుతున్న తరుణంలో..కొత్త గమ్యస్థానాలను కోరుకునే ప్రయాణికులకు రెండు ఉత్తమ ఎంపికలు ఉన్నాయని సలాంఎయిర్, ఒమన్ ఎయిర్ ఇటీవల నైరోబి, రోమ్ నగరాలకు ప్రత్యక్ష మార్గాలను ప్రారంభించాయి. సజావుగా కనెక్టివిటీ, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాలను అందిస్తున్నాయి.
సలాంఎయిర్ సోమవారం నైరోబికి తన మొదటి ప్రత్యక్ష విమానాన్ని ప్రారంభించింది. తూర్పు ఆఫ్రికాతో ఒమన్ సంబంధాన్ని పటిష్టం చేసింది. కెన్యా రాజధానికి ప్రారంభ విమానానికి జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో గొప్ప స్వాగతం లభించింది. దీనికి రెండు దేశాల కీలక అధికారులు హాజరయ్యారు. సలాం ఎయిర్ సీఈఓ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ ఈ కొత్త మార్గం ప్రాముఖ్యతను నచెప్పారు. ఒమన్ -కెన్యా మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్రను హైలైట్ చేశారు.
తాజాగా మస్కట్ను రోమ్కు కలుపుతూ ఒమన్ ఎయిర్ సర్వీస్ ప్రారంభించింది. వారాకి నాలుగు విమానాలతో ఈ సేవ ఇటలీ చారిత్రాత్మక రాజధానిని అన్వేషించడానికి ఆసక్తి ఉన్న ప్రయాణికులకు స్వాగతం పలుకుతోంది.
యూరోపియన్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి, విమానాల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి రోమ్-మస్కట్ మార్గాన్ని వ్యూహాత్మక చర్యగా ఒమన్ ఎయిర్ సీఈఓ కాన్ కోర్ఫియాటిస్ అభివర్ణించారు. ఈద్ విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ప్రయాణికులకు ఈ కొత్త మార్గాలు ఉత్తేజకరమైన అవకాశాలను అందిస్తాయి.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







