నిషేధిత కంటెంట్ను షేర్ చేస్తే Dh1 మిలియన్ జరిమానా, జైలుశిక్ష..!!
- March 18, 2025
యూఏఈ: సోషల్ మీడియాలో సామాజిక వ్యతిరేక, నైతికంగా అనైతిక కంటెంట్ను పోస్ట్ చేసి షేర్ చేసే 1 మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా, జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు పలువురు న్యాయవాదులు వెల్లడించారు. యూఏఈ చట్టం ప్రకారం, నిషేధించబడిన కంటెంట్ను షేర్ చేసే, తిరిగి పోస్ట్ చేసే లేదా పంపిణీ చేసే వ్యక్తి అసలు పోస్ట్ చేసిన వారితో సమానంగా బాధ్యత వహిస్తారు. యూఏఈ లోని సోషల్ మీడియా వినియోగదారులు జాతీయ విలువలను, గౌరవం, సహజీవన సూత్రాలకు అనుగుణంగా వ్యవహారించాలని యూఏఈ జాతీయ మీడియా కార్యాలయం (NMO) పేర్కొంది. జాతీయ చిహ్నాలు, ప్రజా వ్యక్తులు లేదా స్నేహపూర్వక దేశాలు, వారి సమాజాలను అగౌరవపరిచే కంటెంట్కు వ్యతిరేకంగా తాజాగా హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి Dh1,000 నుండి Dh1 మిలియన్ వరకు జరిమానాలు విధించవచ్చని, పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా Dh2 మిలియన్లకు పెరుగుతుందన్నారు. అదే సమయంలో ఉల్లంఘించే మీడియా సంస్థలను 6 నెలల వరకు తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందని అల్ తమీమి & కంపెనీలో డిజిటల్, డేటా అసోసియేట్ ఫాత్మా అల్ జడ్జాలి ఖలీజ్ టైమ్స్తో అన్నారు.
సోషల్ మీడియా వాడకం అనేది యూఏఈలో ప్రవాసులు, జాతీయులలో బాగా ప్రాచుర్యం పొందింది. సగటున, ప్రతి నివాసి Instagram, Facebook, X, TikTok ఇతర ప్రముఖ ప్లాట్ఫామ్లలో ఒకటి కంటే ఎక్కువ సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సాధారణ మీడియా చట్ట ఉల్లంఘనలతో పాటు, సోషల్ మీడియాలో చేసిన నిర్దిష్ట చర్యలు కూడా తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







