బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- March 20, 2025
మనామా: బహ్రెయిన్ సమాచార మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా అల్ నోయిమి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించడానికి బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ అల్ నోయిమి వివిధ రంగాలలో బహ్రెయిన్ -ఇండియా మధ్య దీర్ఘకాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాల నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
తనకు లభించిన సాదర స్వాగతానికి రాయబారి జాకబ్, బహ్రెయిన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్తో తమ సహకారాన్ని మరింత విస్తృతం చేయడానికి ఇండియా ఆసక్తిని హైలైట్ చేశారు. ఈ సమావేశం రెండు దేశాలు తమ దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, వివిధ రంగాలలో లోతైన సంబంధాలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







