బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- March 20, 2025
మనామా: బహ్రెయిన్ సమాచార మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా అల్ నోయిమి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించడానికి బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ అల్ నోయిమి వివిధ రంగాలలో బహ్రెయిన్ -ఇండియా మధ్య దీర్ఘకాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాల నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
తనకు లభించిన సాదర స్వాగతానికి రాయబారి జాకబ్, బహ్రెయిన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్తో తమ సహకారాన్ని మరింత విస్తృతం చేయడానికి ఇండియా ఆసక్తిని హైలైట్ చేశారు. ఈ సమావేశం రెండు దేశాలు తమ దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, వివిధ రంగాలలో లోతైన సంబంధాలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!







