బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- March 20, 2025
మనామా: బహ్రెయిన్ సమాచార మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా అల్ నోయిమి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించడానికి బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ అల్ నోయిమి వివిధ రంగాలలో బహ్రెయిన్ -ఇండియా మధ్య దీర్ఘకాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాల నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
తనకు లభించిన సాదర స్వాగతానికి రాయబారి జాకబ్, బహ్రెయిన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్తో తమ సహకారాన్ని మరింత విస్తృతం చేయడానికి ఇండియా ఆసక్తిని హైలైట్ చేశారు. ఈ సమావేశం రెండు దేశాలు తమ దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, వివిధ రంగాలలో లోతైన సంబంధాలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







