బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- March 20, 2025
మనామా: బహ్రెయిన్ సమాచార మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా అల్ నోయిమి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించడానికి బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ అల్ నోయిమి వివిధ రంగాలలో బహ్రెయిన్ -ఇండియా మధ్య దీర్ఘకాలంగా ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాల నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
తనకు లభించిన సాదర స్వాగతానికి రాయబారి జాకబ్, బహ్రెయిన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్తో తమ సహకారాన్ని మరింత విస్తృతం చేయడానికి ఇండియా ఆసక్తిని హైలైట్ చేశారు. ఈ సమావేశం రెండు దేశాలు తమ దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, వివిధ రంగాలలో లోతైన సంబంధాలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!