యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- March 20, 2025
యూఏఈ: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.దాంతో యూఏఈలో ఆభరణాల కొనుగోలుదారులు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. సాంప్రదాయ 22 కేరట్ల బంగారు ఆభరణాల స్థానంలో 18 కేరట్ల ఆభరణాలను కొనుగోళు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఇటీవల వాటి అమ్మకాలు పెరిగాయని రిటైలర్లు చెబుతున్నారు. రాబోయే ఈద్ అల్ ఫితర్ వేడుకల కోసం సరసమైన ఎంపికల వైపు కస్టమర్లు ఆసక్తి చూపుతారని దుకాణాల యజమానులు వెల్లడించారు.
పెరుగుతున్న బంగారం ధరలు తేలికైన ఆభరణాల కొనుగోళ్లపై ఆసక్తిని పెంచుతున్నాయని డయాన్ జ్యువెలరీ వ్యవస్థాపకుడు రాహుల్ సాగర్ తెలిపారు. "గత కొన్ని సంవత్సరాలుగా, తేలికైన ఆభరణాల వైపు స్పష్టమైన మార్పును మేము చూశాము. చాలా మంది కస్టమర్లు బరువైన వస్తువుల స్థానంలో బడ్జెట్ ధరల్లోని ఆభరణాలను కొంటున్నారు. " అని ఆయన అన్నారు. గోల్డ్ సౌక్ వంటి సాంప్రదాయ బంగారు మార్కెట్లలో 22కేరట్ల బంగారం ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, 18 కేరట్ల బంగారం బోటిక్ దుకాణాలలో, ముఖ్యంగా దీర్ఘకాలిక యూఏఈ నివాసితులలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిందని సాగర్ తెలిపారు.
అధిక బంగారం ధరల కారణంగా బహుమతులు, అప్పుడప్పుడు ధరించడానికి 18-క్యారెట్ ఆభరణాలు ఇష్టపడే ఎంపికగా మారాయి. బంగారం ధరల పెరుగుదల మధ్య వినియోగదారులు పండుగ కోసం తమ కొనుగోలు విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నారని గోల్డ్ అండ్ డైమండ్ పార్క్లోని గోల్డ్ అండ్ జెమ్స్ గ్యాలరీ మేనేజింగ్ డైరెక్టర్ అసిమ్ దాముడి అన్నారు. "పెట్టుబడి ప్రయోజనాల కోసం, ప్రజలు ఇప్పటికీ 24-క్యారెట్ లేదా 22-క్యారెట్ వంటి స్వచ్ఛమైన బంగారాన్ని ఇష్టపడతారు. అయితే, బహుమతిగా ఇవ్వడానికి , అప్పుడప్పుడు ధరించడానికి ధరల పెరుగుదల కారణంగా 18-క్యారెట్ బంగారానికి డిమాండ్ ఉంది." అని ఆయన అన్నారు. అసిమ్ దాముడి ప్రకారం.. ఈద్ ఆభరణాల బహుమతుల కోసం సగటు ఖర్చు దిర్హామ్స్ 1,000-దిర్హామ్స్ 1,800 మధ్య ఉంటుంది. పెండెంట్లు, చెవిపోగులు, బ్రాస్లెట్లు ఎక్కువగా కోరుకునే వస్తువులుగా ఉన్నాయి.
గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్లోని జ్యువెల్ ట్రేడింగ్ మేనేజర్ దిపెన్ వాధేర్ మాట్లాడుతూ.. "భారతీయులు 22-క్యారెట్ ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అరబ్ జాతీయులు 21-క్యారెట్ బంగారాన్ని ఎంచుకుంటారు. అయితే, వివాహాల కోసం, ఎమిరాటీలు, అరబ్బులు తరచుగా వజ్రాల నెక్లెస్లను ఎంచుకుంటారు." అని పేర్కొన్నారు. వజ్రాల ఆభరణాల ధరలు తగ్గాయని, కొంతమంది కొనుగోలుదారులకు అవి మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారిందని వ్యాపారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి
- నేడే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు…తరలి వస్తున్న ప్రపంచదేశాల అధినేతలు