జులై 15 న విడుదల కానున్న 'నాయకి'
- July 05, 2016
త్రిష ప్రధాన పాత్రలో గొవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'నాయకి'. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం కొన్ని కారణాల వల్ల 15న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, మనోబాల, గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేశ్, జయప్రకాశ్ తదితరులు ఈ చిత్రం ప్రధాన పాత్రలు పోషించారు. రఘు కుంచె చిత్రానికి సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్రిష తొలిసారి లేడీ ఓరియెంటెడ్లో నటించిన చిత్రమిది.ప్రస్తుతం ఆమె 'మోహిని' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం లండన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







