ఈద్ అల్ ఫితర్ సెలవులు.. ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ తేదీలు వెల్లడి..!!
- March 20, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సెలవులకు ముందు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు దుబాయ్ నుండి బయలుదేరి వెళతారని ఎమిరేట్స్ వెల్లడించింది. టెర్మినల్ 3 ప్రవేశ ద్వారాల వద్ద రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ముందుగానే సిద్ధమై రావాలని సూచించింది. మార్చి 28, 29 తేదీలలో టెర్మినల్ 3లో అత్యంత రద్దీగా ఉంటుందని పేర్కొంది. అలాగే ఏప్రిల్ 5, 6 వ తేదీలలోనూ ప్రయాణికుల రద్దీ ఉంటుందని, దాదాపు 80వేల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు సెలవుల సందర్భంగా విదేశాలకు వెళ్లడం, రావడం చేస్తారని తెలిపారు.
ప్రయాణీకులు తమ విమాన ప్రయాణ సమయానికి 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని, బోర్డింగ్ సమయాలను గమనించాలని సూచించింది. ప్రయాణానికి ముందు రాత్రి విమానాశ్రయంలో కస్టమర్లు తమ లగేజీని ఉచితంగా డ్రాప్ చేయవచ్చని గుర్తుచేసింది. దాంతో నేరుగా ప్రాసెసింగ్ కోసం ఇమ్మిగ్రేషన్ లేదా స్మార్ట్ టన్నెల్కు నేరుగా వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రయాణీకులు ఎమిరేట్స్ వెబ్సైట్, యాప్, సిటీ చెక్-ఇన్, కియోస్క్లు, మొబైల్ పోర్ట్లు, హోమ్ చెక్-ఇన్ సేవల ద్వారా చెక్-ఇన్ చేయవచ్చని వెల్లడించింది. విమానాలు బయలుదేరే 20 నిమిషాల ముందు బోర్డింగ్ గేట్లు మూసివేయబడతాయని, విమానాలు షెడ్యూల్ ప్రకారం బయలుదేరేలా చూసుకోవడానికి చెక్-ఇన్, గేట్ మూసివేత సమయాలను ఖచ్చితంగా పాటిస్తారని గుర్తుచేసింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







