ఈద్ అల్ ఫితర్ సెలవులు.. ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ తేదీలు వెల్లడి..!!
- March 20, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సెలవులకు ముందు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు దుబాయ్ నుండి బయలుదేరి వెళతారని ఎమిరేట్స్ వెల్లడించింది. టెర్మినల్ 3 ప్రవేశ ద్వారాల వద్ద రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ముందుగానే సిద్ధమై రావాలని సూచించింది. మార్చి 28, 29 తేదీలలో టెర్మినల్ 3లో అత్యంత రద్దీగా ఉంటుందని పేర్కొంది. అలాగే ఏప్రిల్ 5, 6 వ తేదీలలోనూ ప్రయాణికుల రద్దీ ఉంటుందని, దాదాపు 80వేల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు సెలవుల సందర్భంగా విదేశాలకు వెళ్లడం, రావడం చేస్తారని తెలిపారు.
ప్రయాణీకులు తమ విమాన ప్రయాణ సమయానికి 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని, బోర్డింగ్ సమయాలను గమనించాలని సూచించింది. ప్రయాణానికి ముందు రాత్రి విమానాశ్రయంలో కస్టమర్లు తమ లగేజీని ఉచితంగా డ్రాప్ చేయవచ్చని గుర్తుచేసింది. దాంతో నేరుగా ప్రాసెసింగ్ కోసం ఇమ్మిగ్రేషన్ లేదా స్మార్ట్ టన్నెల్కు నేరుగా వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రయాణీకులు ఎమిరేట్స్ వెబ్సైట్, యాప్, సిటీ చెక్-ఇన్, కియోస్క్లు, మొబైల్ పోర్ట్లు, హోమ్ చెక్-ఇన్ సేవల ద్వారా చెక్-ఇన్ చేయవచ్చని వెల్లడించింది. విమానాలు బయలుదేరే 20 నిమిషాల ముందు బోర్డింగ్ గేట్లు మూసివేయబడతాయని, విమానాలు షెడ్యూల్ ప్రకారం బయలుదేరేలా చూసుకోవడానికి చెక్-ఇన్, గేట్ మూసివేత సమయాలను ఖచ్చితంగా పాటిస్తారని గుర్తుచేసింది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







