'ఆర్థిక ఇబ్బందుల్లో' ఉన్న ఫిలిప్పీన్స్ ప్రవాసిని వరించిన అధృష్టం..!!
- March 20, 2025
యూఏఈ: 'ఆర్థిక ఇబ్బందుల్లో' ఉన్న ఫిలిప్పీన్స్ ప్రవాసిని అధృష్టం వరించింది. యూఏఈ లాటరీలో పాల్గొని Dh1 మిలియన్ గెలుచుకున్న ఫిలిప్పీన్స్లోని మనీలాకు చెందిన బ్యూరెగార్డ్ లిమ్ రెండవ వ్యక్తిగా నిలిచాడు. "ఆర్థిక సమస్యలు" అధికంగా ఉన్న సమయంలో విజేతగా నిలవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
“నేను ఆర్థిక చింతల కారణంగా నిరాశ చెందాను. సహాయం కోసం నా కుటుంబ సభ్యులను సంప్రదించాను. కానీ ఆ రాత్రి, నా తల్లి నన్ను చూసి నవ్వుతున్నట్లు నేను కలలు కన్నాను. తరువాత, నేను నా ఫోన్ను తనిఖీ చేసినప్పుడు, నాకు ఒక నోటిఫికేషన్ కనిపించింది: 'అభినందనలు' మీరు లాటరీ గెలుచుకున్నారు. అది చూసి నేను నమ్మలేకపోయాను. నా భార్య, నేను రెండుసార్లు తనిఖీ చేసాము. సంఖ్యలు అన్నీ కరెక్టుగానే ఉన్నాయి. అది నిజమే!” అని అతను వివరించాడు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







