నాలుగవ షెడ్యూల్ కి చేరుకున్న 'వైశాఖం'
- July 05, 2016
బి. జయ దర్శకత్వంలో ఆర్.జె సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు నిర్మిస్తున్న 'వైశాఖం' చిత్రం నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది. జులై 20 వరకు జరిగే ఈ షెడ్యూల్లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్ని, ఓ పాటని చిత్రీకరిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకురాలు బి. జయ మాట్లాడుతూ 'లవ్లీ తర్వాత మళ్లీ సూపర్హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా వైశాఖం. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే మంచి సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇది అపార్ట్మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది. దర్శకురాలిగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. అలాగే కమర్షియల్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్తుంది. కజక్స్థాన్లో తీసిన సాంగ్స్ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయి' అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







