'ఓం నమో వేంకటేశాయ'లో అనుష్క!
- July 05, 2016
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో అనుష్క భక్తురాలి పాత్రలో నటిస్తున్నట్లు దర్శకేంద్రుడు సోషల్మీడియా ద్వారా తెలిపారు. 'ఏ పాత్ర అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా.. తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో తనకి నా సినిమాలో తగిన పాత్ర వస్తే చేయాలని ఉంది. ఇన్నాళ్లకి 'ఓం నమో వేంకటేశాయ' ద్వారా అది జరిగింది. తన కెరీర్లో మొదటిసారి భక్తురాలి పాత్ర చేస్తుంది. ఆ రోల్లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, కొత్తగా కన్పిస్తుంది. 'ఓం నమో వేంకటేశాయ'లో అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు'. అని రాఘవేంద్రరావు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







