'ఓం నమో వేంకటేశాయ'లో అనుష్క!
- July 05, 2016
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో అనుష్క భక్తురాలి పాత్రలో నటిస్తున్నట్లు దర్శకేంద్రుడు సోషల్మీడియా ద్వారా తెలిపారు. 'ఏ పాత్ర అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా.. తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో తనకి నా సినిమాలో తగిన పాత్ర వస్తే చేయాలని ఉంది. ఇన్నాళ్లకి 'ఓం నమో వేంకటేశాయ' ద్వారా అది జరిగింది. తన కెరీర్లో మొదటిసారి భక్తురాలి పాత్ర చేస్తుంది. ఆ రోల్లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, కొత్తగా కన్పిస్తుంది. 'ఓం నమో వేంకటేశాయ'లో అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు'. అని రాఘవేంద్రరావు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









