'ఓం నమో వేంకటేశాయ'లో అనుష్క!
- July 05, 2016
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో అనుష్క భక్తురాలి పాత్రలో నటిస్తున్నట్లు దర్శకేంద్రుడు సోషల్మీడియా ద్వారా తెలిపారు. 'ఏ పాత్ర అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా.. తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో తనకి నా సినిమాలో తగిన పాత్ర వస్తే చేయాలని ఉంది. ఇన్నాళ్లకి 'ఓం నమో వేంకటేశాయ' ద్వారా అది జరిగింది. తన కెరీర్లో మొదటిసారి భక్తురాలి పాత్ర చేస్తుంది. ఆ రోల్లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, కొత్తగా కన్పిస్తుంది. 'ఓం నమో వేంకటేశాయ'లో అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు'. అని రాఘవేంద్రరావు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









