బంగారం ధరలకు రెక్కలు.. $3,200కి చేరుకునే అవకాశం..!!
- March 23, 2025
యూఏఈ: ఈ నెల ప్రారంభంలో $3,000 స్థాయిని దాటిన తర్వాత బంగారం ధరలు మరింత దూసుకుపోతున్నాయి. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో $3,200కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)లోకి పెట్టుబడులు, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు నేపథ్యంలో బంగారానికి మద్దతు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి 14న బంగారం ధరల తొలిసారిగా ఔన్సుకు $3,000 మార్కును దాటింది.
"మేము బంగారంపై మా బుల్లిష్ వైఖరిని కొనసాగిస్తున్నాము. మా మునుపటి లక్ష్యమైన ఔన్సుకు $3,000 చేరుకున్న తర్వాత, జూన్ నాటికి నాటికి ఔన్సుకు $3,200 కు మా లక్ష్యాన్ని సవరించాము" అని UBS గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మార్క్ హేఫెల్ అన్నారు.
ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తే, బంగారం $3,100–$3,125 శ్రేణికి పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక ఆందోళనలు పెరిగితే లేదా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అంతరాయాలను ఎదుర్కొంటే $3,180–$3,200 వరకు మరింత లాభాలు పొందే అవకాశం ఉంది. దాంతోపాటు కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా చైనా, రష్యాలో కొనసాగుతున్న బంగారం కొనుగోళ్లు బుల్లిష్ ధోరణిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









