బంగారం ధరలకు రెక్కలు.. $3,200కి చేరుకునే అవకాశం..!!
- March 23, 2025
యూఏఈ: ఈ నెల ప్రారంభంలో $3,000 స్థాయిని దాటిన తర్వాత బంగారం ధరలు మరింత దూసుకుపోతున్నాయి. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో $3,200కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)లోకి పెట్టుబడులు, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు నేపథ్యంలో బంగారానికి మద్దతు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి 14న బంగారం ధరల తొలిసారిగా ఔన్సుకు $3,000 మార్కును దాటింది.
"మేము బంగారంపై మా బుల్లిష్ వైఖరిని కొనసాగిస్తున్నాము. మా మునుపటి లక్ష్యమైన ఔన్సుకు $3,000 చేరుకున్న తర్వాత, జూన్ నాటికి నాటికి ఔన్సుకు $3,200 కు మా లక్ష్యాన్ని సవరించాము" అని UBS గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మార్క్ హేఫెల్ అన్నారు.
ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తే, బంగారం $3,100–$3,125 శ్రేణికి పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక ఆందోళనలు పెరిగితే లేదా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అంతరాయాలను ఎదుర్కొంటే $3,180–$3,200 వరకు మరింత లాభాలు పొందే అవకాశం ఉంది. దాంతోపాటు కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా చైనా, రష్యాలో కొనసాగుతున్న బంగారం కొనుగోళ్లు బుల్లిష్ ధోరణిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







