ఏప్రిల్ నుండి 10% వరకు పెరుగనున్న వీసా ఖర్చులు..!!
- March 24, 2025
యూఏఈ: యునైటెడ్ కింగ్డమ్కు ప్రయాణించే యూఏఈ నివాసితులు వచ్చే నెల నుండి అధిక వీసా ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది. వివిధ వర్గాలకు వీసాల రుసుములు దాదాపు 10 శాతం పెరిగాయి. ఏప్రిల్ 9 నుండి 6 నెలల వరకు విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు రుసుము £115తో పోలిస్తే £127 చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా, రెండు సంవత్సరాల వరకు విజిట్ వీసా ధర £43 పెరిగి £475కి చేరుకుంది. ఐదు సంవత్సరాల వరకు వీసా ధర £77 పెరిగి £848 కు చేరుకుంటుంది. 10 సంవత్సరాల వరకు వీసా ధర £96 పెరిగి £1,059 కు చేరింది. అయితే, యూకేకి ప్రయాణించే ఎమిరాటీలు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ETA ప్రస్తుతం £10 ఖర్చవుతుంది. రెండు సంవత్సరాలలో ఆరు నెలల వరకు లేదా హోల్డర్ పాస్పోర్ట్ గడువు ముగిసే వరకు ఒకేసారియూకేకి పలుసార్లు అనుమతిస్తుంది. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో యూఏఈ పౌరులు, ప్రవాస నివాసితులు యూరోపియన్ దేశానికి ప్రయాణిస్తుంటారు.
షెంగెన్ దేశాల కంటే వీసా దరఖాస్తు స్లాట్లను సులభంగా యాక్సెస్ చేయడం వలన ఎక్కువ మంది యూకే వైపు ఆకర్షితులవుతున్నారని డీరా ట్రావెల్ జనరల్ మేనేజర్ సుధీష్ తెలిపారు.వైస్ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. సింగిల్ ఎంట్రీ వీసాలు ఇచ్చే ఇతర యూరోపియన్ దేశాల మాదిరిగా కాకుండా, ఆరు నెలల వీసాల నుండి మల్టీ ఎంట్రీలను ఇవ్వడం వలన అనేకమంది యూకేలో పర్యటించేందుకు ఇష్టపడతారని అన్నారు. పైగా యూకే వీసా కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







