ఈ నెల 8 నుంచి ఆగస్టు 3 వరకు డ్రోన్‌ కెమెరాలపై నిషేదం

- July 05, 2016 , by Maagulf
ఈ నెల 8 నుంచి ఆగస్టు 3 వరకు  డ్రోన్‌ కెమెరాలపై నిషేదం

ఉగ్ర దాడుల నేపథ్యంలో నగర గగనతలంపై రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే డ్రోన్‌లు, మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌, పారా గ్లైడర్స్‌ను నిషేధిస్తున్నట్టు నగర పోలీసులు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశమార్గం గుండా అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఉత్సవాలు, వివాహ వేడుకల సమయంలో కూడా నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా భద్రత దృష్ట్యా నిబంధనలు ఈ నెల 8 నుంచి ఆగస్టు 3 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com