2015 నుండి జరిగిన ‘డ్రా’లపై తనిఖీలు: కువైట్

- March 28, 2025 , by Maagulf
2015 నుండి జరిగిన ‘డ్రా’లపై తనిఖీలు: కువైట్

కువైట్: 2015 నుండి ప్రారంభమైన బ్యాంకులు,  వాణిజ్య సంస్థల డ్రాలను పరిశీలించి, వాటి చట్టబద్ధతను నిర్ణయించడం జరుగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. ఆధారాలు,  చట్టపరమైన ప్రక్రియను బట్టి పరిశీలన తేదీని పొడిగించవచ్చని కమిటీ అధిపతి అద్నాన్ అబోల్ అన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని స్వీకరించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు రాఫెల్ డ్రాల కుంభకోణానికి సంబంధించిన ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు ప్రవాసులను అరెస్టు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర అనుమానితుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇంటర్‌పోల్‌తో అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌లను కూడా జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com