ఏపీ: నూకాంబిక కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర
- March 29, 2025
విశాఖపట్నం: అనకాపల్లి నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ మహోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం రాష్ట్ర గనులు, భూగర్బ, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎమ్.జాహ్నవి, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, కె.ఎస్.ఎన్.రాజు, అర్బన్ పైనాన్స్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషను చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ,ఎ.పి.గవర సంక్షేమ, అభివృద్ది కార్పొరేషను చైర్మన్ మల్ల సురేంద్ర, కొప్పులవెలమ సంక్షేమ, అభివృద్ది కార్పొరేషను చైర్మన్ పి.వి.జి. కుమార్ అతిధులుగా పాల్గొన్నారు.అమ్మవారి దర్శనం అనంతరం అతిధులకు ఆలయ అధికారులు వేద ఆశీర్వచనాలు, అమ్మవారి ప్రతిమ, ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









