దుబాయ్ లో డ్రగ్స్ వినియోగించిన వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష..!!
- March 29, 2025
యూఏఈ: 89 గ్రాముల హెరాయిన్తో పట్టుబడిన 38 ఏళ్ల ఆసియా వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది దుబాయ్ క్రిమినల్ కోర్టు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, శిక్ష పూర్తయిన తర్వాత అతనిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఆ వ్యక్తి అల్ సత్వాలోని తన నివాసంలో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో వారు రైడ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ-నార్కోటిక్స్ అధికారులు రైడింగ్ చేసి, అతని వద్ద నుండి మూడు హెరాయిన్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విచారణ సమయంలో, ఆ వ్యక్తి వ్యక్తిగత ఉపయోగం కోసం హెరాయిన్ను కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. అతను వాట్సాప్ ద్వారా మరొక ఆసియా వ్యక్తి నుండి డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తరువాత ప్రారంభ తీర్పును సమర్థించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







