దుబాయ్ లో డ్రగ్స్ వినియోగించిన వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష..!!
- March 29, 2025
యూఏఈ: 89 గ్రాముల హెరాయిన్తో పట్టుబడిన 38 ఏళ్ల ఆసియా వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది దుబాయ్ క్రిమినల్ కోర్టు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, శిక్ష పూర్తయిన తర్వాత అతనిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఆ వ్యక్తి అల్ సత్వాలోని తన నివాసంలో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో వారు రైడ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ-నార్కోటిక్స్ అధికారులు రైడింగ్ చేసి, అతని వద్ద నుండి మూడు హెరాయిన్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విచారణ సమయంలో, ఆ వ్యక్తి వ్యక్తిగత ఉపయోగం కోసం హెరాయిన్ను కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. అతను వాట్సాప్ ద్వారా మరొక ఆసియా వ్యక్తి నుండి డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తరువాత ప్రారంభ తీర్పును సమర్థించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









