రేపే భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు
- March 30, 2025
న్యూ ఢిల్లీ: పవిత్ర రంజాన్ నెల నేటితో ముగియనుంది. 1446 షవ్వాల్ నెలకు నెలవంక దేశంలో కనిపించిందని సౌదీ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో అరబ్ దేశమైన సౌదీలో అదివారమే ఈద్ ఉల్ ఫితర్ మొదటి రోజును పాటిస్తుంది. అక్కడ రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నేటి ఉదయం ప్రారంభ మయ్యాయి.సౌదీ అరేబియాలో ఈద్ చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత భారతదేశంలో ఈద్ చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత అంటే రేపు ఈద్ పండుగ జరుపుకుంటారు.
భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం మార్చి 2న ప్రారంభం అయ్యింది. అంటే ఈద్ ఉల్ ఫితర్ మార్చి 31 లేదా ఏప్రిల్ 1న వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో, ఈద్ చంద్రుడు కనిపించినప్పుడు మాత్రమే ఈద్ నిర్ణీత తేదీని పరిగణిస్తారు.. నిన్న సౌదీ లో నెల వంక కనిపించడం తో రేపు భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ జరపాలని మత పెద్దలు నిర్ణయించారు.ఆ రోజున, ఈద్గాలో ప్రార్థనలు చేస్తారు. ప్రజలు ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







