రేపే భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు
- March 30, 2025
న్యూ ఢిల్లీ: పవిత్ర రంజాన్ నెల నేటితో ముగియనుంది. 1446 షవ్వాల్ నెలకు నెలవంక దేశంలో కనిపించిందని సౌదీ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో అరబ్ దేశమైన సౌదీలో అదివారమే ఈద్ ఉల్ ఫితర్ మొదటి రోజును పాటిస్తుంది. అక్కడ రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నేటి ఉదయం ప్రారంభ మయ్యాయి.సౌదీ అరేబియాలో ఈద్ చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత భారతదేశంలో ఈద్ చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత అంటే రేపు ఈద్ పండుగ జరుపుకుంటారు.
భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం మార్చి 2న ప్రారంభం అయ్యింది. అంటే ఈద్ ఉల్ ఫితర్ మార్చి 31 లేదా ఏప్రిల్ 1న వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో, ఈద్ చంద్రుడు కనిపించినప్పుడు మాత్రమే ఈద్ నిర్ణీత తేదీని పరిగణిస్తారు.. నిన్న సౌదీ లో నెల వంక కనిపించడం తో రేపు భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ జరపాలని మత పెద్దలు నిర్ణయించారు.ఆ రోజున, ఈద్గాలో ప్రార్థనలు చేస్తారు. ప్రజలు ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









