పాక్‌ ప్రధానికి రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేసిన మోడీ

- July 06, 2016 , by Maagulf
పాక్‌ ప్రధానికి రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేసిన మోడీ

 ముస్లింల పర్వదినం రంజాన్‌ను పురస్కరించుకుని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తమ దేశ ప్రధానికి.. మోదీ స్వయంగా ఫోన్‌ చేసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపినట్లు షరీఫ్‌ అధికారిక కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారని, ప్రకటనలో పేర్కొన్నారు. పాక్‌ ప్రధాని షరీఫ్‌కు ఇటీవలే గుండె శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. రంజాన్‌ సందర్భంగా పాక్‌లో నేడు జాతీయ సెలవుదినం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com