బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ పాట‌ను విడుద‌ల చేసిన కెసిఆర్

- April 03, 2025 , by Maagulf
బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ పాట‌ను విడుద‌ల చేసిన కెసిఆర్

హైద‌రాబాద్: బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ పాట‌ను పార్టీ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. రచయిత, గాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రచించి గానం చేసిన బండెనక బండి కట్టి–గులాబీల జెండ పట్టి బీఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి నివాసంలో ఆవిష్కరించారు.

నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని పేర్కొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు, కళారూపాల్ని రూపొందించాలని ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ రసమయికి సూచించారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com