ఏపీలో 44 బార్లకు ఈ-వేలం
- April 03, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో లైసెన్సు ఫీజు, నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు మద్యనిషేధ, అబ్కారీ శాఖ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 44 బార్లను ఈ-వేలం, ఆన్లైన్ లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. బార్ల లైసెన్సులు పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తు రుసుమును ఏప్రిల్ 8లోగా చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజులు & రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.5 లక్షలు 50వేలు - 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.7.5 లక్షలు 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.10 లక్షలు ఆన్లైన్ వేలం ప్రక్రియలో అధిక మొత్తంలో బిడ్ వేసిన అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్ లైసెన్స్ కేటాయించనున్నారు. ప్రాంతాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్http://apcpe.aptonline.in లో అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!









