ఏపీలో 44 బార్లకు ఈ-వేలం
- April 03, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో లైసెన్సు ఫీజు, నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా ఔత్సాహికులకు కేటాయించేందుకు మద్యనిషేధ, అబ్కారీ శాఖ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 44 బార్లను ఈ-వేలం, ఆన్లైన్ లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. బార్ల లైసెన్సులు పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తు రుసుమును ఏప్రిల్ 8లోగా చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజులు & రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.5 లక్షలు 50వేలు - 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.7.5 లక్షలు 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో → రూ.10 లక్షలు ఆన్లైన్ వేలం ప్రక్రియలో అధిక మొత్తంలో బిడ్ వేసిన అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్ లైసెన్స్ కేటాయించనున్నారు. ప్రాంతాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్http://apcpe.aptonline.in లో అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







