విజయవాడ-ముంబై విమాన సమయం మార్చాలని కేంద్రమంత్రిని కోరిన ఎంపి బాలశౌరి
- April 04, 2025
మచిలీపట్నం: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ నుంచి ముంబైకి నడుస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల సమయాల మార్పు విషయం పై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఉన్న విమాన సమయాలు ప్రయాణికులకు, ముఖ్యంగా వాణిజ్య, విద్య, వైద్య అవసరాలతో విజయవాడ నుండి ముంబైకి వెళ్లే ప్రజలకు అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం సాయంకాలం సమయంలో మాత్రమే విజయవాడ నుండి ముంబై కి ఇండిగో మరియు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతున్నారని, ఒకే సమయంలో ఉండటం వలన ముంబై లో పని ఉన్నవారు తప్పనిసరిగా ముంబై లో రాత్రి వేళ ఎక్కువ ఖర్చుతో గడపవలసి వస్తున్నదని, అదే సమయాలలో మార్పు జరిగి ఉదయం వేళలో విజయవాడ నుండి ముంబై కి విమానాలు నడపటం వలన కార్యాలయాలు పనిచేసే సమయంలో వెళ్లి పనులు పూర్తీ చేసుకొని సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకోవచ్చునని, అప్పుడు సమయం,డబ్బు వృధా కాకుండా ఉంటుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన మంత్రిని స్వయంగా కలిసి వివరించి, ఈ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని ఎంపీ బాలశౌరి కోరడం జరిగింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









