విజయవాడ-ముంబై విమాన సమయం మార్చాలని కేంద్రమంత్రిని కోరిన ఎంపి బాలశౌరి
- April 04, 2025
మచిలీపట్నం: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ నుంచి ముంబైకి నడుస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల సమయాల మార్పు విషయం పై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఉన్న విమాన సమయాలు ప్రయాణికులకు, ముఖ్యంగా వాణిజ్య, విద్య, వైద్య అవసరాలతో విజయవాడ నుండి ముంబైకి వెళ్లే ప్రజలకు అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం సాయంకాలం సమయంలో మాత్రమే విజయవాడ నుండి ముంబై కి ఇండిగో మరియు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతున్నారని, ఒకే సమయంలో ఉండటం వలన ముంబై లో పని ఉన్నవారు తప్పనిసరిగా ముంబై లో రాత్రి వేళ ఎక్కువ ఖర్చుతో గడపవలసి వస్తున్నదని, అదే సమయాలలో మార్పు జరిగి ఉదయం వేళలో విజయవాడ నుండి ముంబై కి విమానాలు నడపటం వలన కార్యాలయాలు పనిచేసే సమయంలో వెళ్లి పనులు పూర్తీ చేసుకొని సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకోవచ్చునని, అప్పుడు సమయం,డబ్బు వృధా కాకుండా ఉంటుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన మంత్రిని స్వయంగా కలిసి వివరించి, ఈ విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని ఎంపీ బాలశౌరి కోరడం జరిగింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







