గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన ఒమన్..!!
- April 05, 2025
మస్కట్: గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ దురాక్రమణను ఒమన్ ఖండించింది. గాజా నగరంలోని ఈశాన్య తుఫా జిల్లాలోని దార్ అల్-అర్కామ్ స్కూల్తో అనుబంధంగా ఉన్న షెల్టర్ సెంటర్ పై బాంబు దాడులకు పాల్పడింది. సౌదీ సెంటర్ ఫర్ కల్చర్ అండ్ హెరిటేజ్కు చెందిన వైద్య, సహాయ సామాగ్రి కోసం ఒక గిడ్డంగి ధ్వంసమైంది. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ దళాలు కొనసాగిస్తున్న దురాక్రమణను, అమాయక పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో కొనసాగుతున్న తీవ్రమైన ఉల్లంఘనలను ఆపడానికి ప్రపంచ దేశాలు కలిసి రావాలని, పాలస్తీనా ప్రజలకు వారి భూములను ఇజ్రాయెల్ తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది. తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపనకు సహకరించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వాత పరిష్కారం చూపాలని ఐక్యరాజ్య మండలిని కోరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!







