బహ్రెయిన్ లో కార్మిక తీర్పులు అమలుపై మంత్రి క్లారిటీ..!!
- April 05, 2025
బహ్రెయిన్: కార్మిక న్యాయస్థాన తీర్పులు కేవలం ఒక పని దినంలో అమలు అవుతున్నాయని న్యాయ మంత్రి నవాఫ్ అల్ మావ్దా అన్నారు. ప్రస్తుత శాసనసభ కాలపరిమితి డిసెంబర్ 2022లో ప్రారంభమైనప్పటి నుండి 5,800 కంటే ఎక్కువ కేసులు వ్యవస్థ ద్వారా ఆమోదించబడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు MP బాస్మా ముబారక్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
2022 డిసెంబర్ 12 నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి 5 మధ్య మొత్తం 5,849 కార్మిక సంబంధిత కేసులు దాఖలు అయ్యాయని మంత్రి తెలిపారు. వాటిలో 4,924 తుది తీర్పులు రాగా, ఇంకా 925 కోర్టుల ముందు ఉన్నాయని తెలిపారు. సగటున కేసును మూడు నెలల్లోనే పరిష్కరించామని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, అందుబాటులో ఉన్న నిధులను స్వాధీనం చేసుకోవడం, రియల్ ఎస్టేట్, వాటాలు లేదా వ్యక్తిగత ఆస్తిని గుర్తించడం వంటి ఆదేశాలు కోర్టులు తీసుకుంటాయని వెల్లడించారు. అయితే, దాదాపు 85 శాతం అమలు అభ్యర్థనలను కోర్టులు ఒక పని దినంలోపు ఆమోదించాయని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







