బహ్రెయిన్ లో కార్మిక తీర్పులు అమలుపై మంత్రి క్లారిటీ..!!
- April 05, 2025
బహ్రెయిన్: కార్మిక న్యాయస్థాన తీర్పులు కేవలం ఒక పని దినంలో అమలు అవుతున్నాయని న్యాయ మంత్రి నవాఫ్ అల్ మావ్దా అన్నారు. ప్రస్తుత శాసనసభ కాలపరిమితి డిసెంబర్ 2022లో ప్రారంభమైనప్పటి నుండి 5,800 కంటే ఎక్కువ కేసులు వ్యవస్థ ద్వారా ఆమోదించబడ్డాయని పేర్కొన్నారు. ఈ మేరకు MP బాస్మా ముబారక్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
2022 డిసెంబర్ 12 నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి 5 మధ్య మొత్తం 5,849 కార్మిక సంబంధిత కేసులు దాఖలు అయ్యాయని మంత్రి తెలిపారు. వాటిలో 4,924 తుది తీర్పులు రాగా, ఇంకా 925 కోర్టుల ముందు ఉన్నాయని తెలిపారు. సగటున కేసును మూడు నెలల్లోనే పరిష్కరించామని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, అందుబాటులో ఉన్న నిధులను స్వాధీనం చేసుకోవడం, రియల్ ఎస్టేట్, వాటాలు లేదా వ్యక్తిగత ఆస్తిని గుర్తించడం వంటి ఆదేశాలు కోర్టులు తీసుకుంటాయని వెల్లడించారు. అయితే, దాదాపు 85 శాతం అమలు అభ్యర్థనలను కోర్టులు ఒక పని దినంలోపు ఆమోదించాయని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







