తొలి వర్టికల్ లిఫ్ట్ ఫ్రీ పంబన్ రైల్వే బిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
- April 06, 2025
చెన్నై: పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి భారత దేశ అభివృద్ధి యాత్రలో ఒక మైలు రాయి అని ప్రధాని మోదీ అన్నారు.₹535 కోట్లతో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బిడ్జిని ఆదివారం ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంతెన రామేశ్వరం యాత్రికులకు, స్థానిక ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. శ్రీలంక పర్యటన ముగించుకుని నేరుగా తమిళనాడు చేరుకున్న ప్రధాని చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ రైల్వే బ్రిడ్జి. ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ వంతెన పొడవు 2.5 కిలోమీటర్లు. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది. ఈ కొత్త వంతెన వల్ల రైలు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడనుంది. ఈ కొత్త వంతెన 1914లో నిర్మించిన పాత పంబన్ బ్రిడ్జికి బదులుగా ప్రత్యామ్నాయంగా నిర్మించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు, రైల్వే అధికారులు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..