తొలి వర్టికల్ లిఫ్ట్ ఫ్రీ పంబన్ రైల్వే బిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
- April 06, 2025
చెన్నై: పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి భారత దేశ అభివృద్ధి యాత్రలో ఒక మైలు రాయి అని ప్రధాని మోదీ అన్నారు.₹535 కోట్లతో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బిడ్జిని ఆదివారం ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంతెన రామేశ్వరం యాత్రికులకు, స్థానిక ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. శ్రీలంక పర్యటన ముగించుకుని నేరుగా తమిళనాడు చేరుకున్న ప్రధాని చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.
తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ రైల్వే బ్రిడ్జి. ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ వంతెన పొడవు 2.5 కిలోమీటర్లు. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది. ఈ కొత్త వంతెన వల్ల రైలు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడనుంది. ఈ కొత్త వంతెన 1914లో నిర్మించిన పాత పంబన్ బ్రిడ్జికి బదులుగా ప్రత్యామ్నాయంగా నిర్మించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు, రైల్వే అధికారులు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







