చైనా 'రివర్స్ టారిఫ్' తో అమెరికా ఉక్కిరిబిక్కిరి!
- April 06, 2025
వాషింగ్టన్: బీజింగ్ మధ్య మరోసారి ఆర్థిక యుద్ధం మోగింది. "నువ్వు నాలుగు కొడితే నేను ఒక్కటి కొట్టలేనా?" అన్నట్లు, అమెరికా విధించిన ప్రతీకార సుంకాలకు చైనా ధీటుగా ప్రతిస్పందించింది. ఈసారి మాటల్లో కాదు… అత్యవసరమైన ఖనిజాలపై నిషేధాలతో! దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ గుండె గుబుసుకోడం మొదలైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, "చైనా అన్యాయంగా వ్యవహరిస్తోంది" అంటూ 34 శాతం అదనపు సుంకాలను విధించడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 10 నుండి అమల్లోకి రానున్న ఈ విధానానికి చైనా కూడా అలాగే 34 శాతం రివర్స్ టారిఫ్ విధించేసింది. అంతే కాదు, అంతకంటే ముందే – ఏప్రిల్ 4 నుంచే అమలు చేస్తూ ఖనిజ ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. అమెరికాకు షాక్ చైనా ఎగుమతి చేసే సమారియం, గాడోలినియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం లాంటి అరుదైన భూకనిజాలపై ఎంబార్గో విధించడంతో… అమెరికాలో రక్షణ, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ పరిశ్రమలు హడలెత్తిపోయాయి. ఎందుకంటే ఈ విభాగాలన్నీ ఈ ఖనిజాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అంతేకాదు, 16 అమెరికన్ కంపెనీలకు చైనా పూర్తిగా డ్యూయల్-యూజ్ వస్తువుల ఎగుమతిని నిలిపివేసింది. దీన్ని చైనా “వ్యవహార మార్గదర్శక ప్రతీకారం” అని పేర్కొనగా, అమెరికా మాత్రం దీన్ని “వాణిజ్య దుర్వినియోగం”గా అభివర్ణిస్తోంది. ట్రంప్ స్పందన సోషల్ మీడియా వేదికగా ట్రంప్, “చైనా మా దెబ్బకు గాబరా పడిపోయింది… వాళ్ల చర్యలు తుత్తికట్టిన ప్రయత్నం మాత్రమే” అని వ్యాఖ్యానించినా, చైనా స్పందన తీవ్రంగా ఉంటుందని ట్రంప్ ఊహించలేదన్న వాదన బలపడుతోంది. చైనాది నిశ్శబ్ద ప్రతీకారం…ఒకటే దెబ్బలో అమెరికా కీలక పరిశ్రమలను వణికించింది.
తాజా వార్తలు
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!









