చైనా 'రివర్స్ టారిఫ్' తో అమెరికా ఉక్కిరిబిక్కిరి!
- April 06, 2025
వాషింగ్టన్: బీజింగ్ మధ్య మరోసారి ఆర్థిక యుద్ధం మోగింది. "నువ్వు నాలుగు కొడితే నేను ఒక్కటి కొట్టలేనా?" అన్నట్లు, అమెరికా విధించిన ప్రతీకార సుంకాలకు చైనా ధీటుగా ప్రతిస్పందించింది. ఈసారి మాటల్లో కాదు… అత్యవసరమైన ఖనిజాలపై నిషేధాలతో! దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ గుండె గుబుసుకోడం మొదలైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, "చైనా అన్యాయంగా వ్యవహరిస్తోంది" అంటూ 34 శాతం అదనపు సుంకాలను విధించడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 10 నుండి అమల్లోకి రానున్న ఈ విధానానికి చైనా కూడా అలాగే 34 శాతం రివర్స్ టారిఫ్ విధించేసింది. అంతే కాదు, అంతకంటే ముందే – ఏప్రిల్ 4 నుంచే అమలు చేస్తూ ఖనిజ ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. అమెరికాకు షాక్ చైనా ఎగుమతి చేసే సమారియం, గాడోలినియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం లాంటి అరుదైన భూకనిజాలపై ఎంబార్గో విధించడంతో… అమెరికాలో రక్షణ, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ పరిశ్రమలు హడలెత్తిపోయాయి. ఎందుకంటే ఈ విభాగాలన్నీ ఈ ఖనిజాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అంతేకాదు, 16 అమెరికన్ కంపెనీలకు చైనా పూర్తిగా డ్యూయల్-యూజ్ వస్తువుల ఎగుమతిని నిలిపివేసింది. దీన్ని చైనా “వ్యవహార మార్గదర్శక ప్రతీకారం” అని పేర్కొనగా, అమెరికా మాత్రం దీన్ని “వాణిజ్య దుర్వినియోగం”గా అభివర్ణిస్తోంది. ట్రంప్ స్పందన సోషల్ మీడియా వేదికగా ట్రంప్, “చైనా మా దెబ్బకు గాబరా పడిపోయింది… వాళ్ల చర్యలు తుత్తికట్టిన ప్రయత్నం మాత్రమే” అని వ్యాఖ్యానించినా, చైనా స్పందన తీవ్రంగా ఉంటుందని ట్రంప్ ఊహించలేదన్న వాదన బలపడుతోంది. చైనాది నిశ్శబ్ద ప్రతీకారం…ఒకటే దెబ్బలో అమెరికా కీలక పరిశ్రమలను వణికించింది.
తాజా వార్తలు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక







