బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు

- July 06, 2016 , by Maagulf
బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు

బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రంజాన్ ప్రార్థనల సమయంలో బంగ్లాదేశ్‌లోని కిశోర్‌గంజ్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఓ కానిస్టేబుల్ ఉన్నారు. పేలుడులో మరో 12 మందికి గాయాలయ్యాయి. తాజా పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ను ప్రకటించింది. ఇటీవలే ఉగ్రవాదులు విదేశీయులను లక్ష్యంగా చేసుకొని ఢాకా రెస్టారెంట్ పై జరిపిన దాడిలో 20మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com