టోనీ బ్లేయర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ దర్యాప్తు నివేదిక ..
- July 06, 2016
తప్పుడు నిఘా సమాచారం ఆధారంగానే అప్పట్లో అమెరికాతో కలిసి బ్రిటన్ ఇరాక్పై యుద్ధం చేసిందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. అప్పటి బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లేయర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ దర్యాప్తు నివేదిక ఎన్నో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.శాంతియుతంగా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా తప్పుడు నిఘా సమాచారం ఆధారంగానే ఇరాక్పై యుద్ధ్భేరీ మోగించాలని అప్పటి బ్లేయర్ ప్రభుత్వం నిర్ణయించిందని జాన్ చిల్కాట్ అధ్యక్షతన పనిచేసిన దర్యాప్తు సంఘం తన నివేదికలో తెలిపింది. ఇరాక్ నిరాయిధీకరణకు సంబంధించి ఉన్న అవకాశాలను బ్రిటన్ విస్మరించిందని, అమెరికాతో చేతులు కలిపి యుద్ధానికి దిగిందని పేర్కొంది. అప్పట్లో ఇరాక్పై సైనిక చర్యకు దిగాల్సిన అవసరం లేకపోయినా అందుకే మొగ్గుచూపారని జాన్ చిల్కాట్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే మానవాళి విధ్వంసక ఆయుధాలు ఉన్నాయన్న కథనాల్లో ఎలాంటి విశ్వసనీయత లేదని కూడా ఆయన తెలిపారు. మొత్తం 12 సంపుటాలు, 2.6 మిలియన్ పదాలు కలిగిన నివేదిక కాపీని ఆయన ప్రభుత్వానికి అందించారు. 2009న ఏర్పాటైన ఈ కమిషన్ ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాత్ర సహేతుకను అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది. 2003 నుంచి 2009 మధ్యకాలంలో ఇరాక్ యుద్ధంలో 180 మంది బ్రిటన్ సైనికులు మరణించారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







