రాస్ అల్ ఖైమాలో విషాదం..నీటి బకెట్లో మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- April 07, 2025
యూఏఈ: గత శుక్రవారం పాత రాస్ అల్ ఖైమాలోని సిద్రోహ్ పరిసరాల్లో విషాధం చోటుచేసుకుంది. ఇంట్లో నీటితో నిండిన బకెట్లో మునిగి రెండేళ్ల బాలుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నలుగురు తోబుట్టువులలో చిన్నవాడు. పాకిస్తాన్ సంతతి బాలుడైన అబ్దుల్లా మొహమ్మద్ మొహమ్మద్ అలీని కుటుంబసభ్యులు రస్ అల్ ఖైమాలోని సఖ్ర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే లోపే అతను మరణించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అబ్దుల్లా ఇంట్లో ఆడుకుంటూ వంటగదిలోకి వచ్చి అక్కడే ఉన్న నీటితో నిండిన బకెట్లో పడి చనిపోయాడని, ఆ సమయంలో అతని తండ్రి శుక్రవారం ప్రార్థనల కోసం వెళ్లాడని పోలీసులు తెలిపారు. తన భార్య బట్టలు ఉతకడానికి ఉపయోగించిన తర్వాత బకెట్ను సాధారణంగా మూసేస్తారని, కానీ ఒకసారి దానిని మర్చిపోవడంతో తమ కుటుంబంలో తీరని విషాదం నింపిందని ఆ బిడ్డ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









