ఒమన్ లో 35వేల కంటే ఎక్కువ వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- April 09, 2025
మస్కట్: వాణిజ్యం, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ.. గడువు ముగిసిన లేదా కార్యకలాపాలను నిలిపివేసిన 35,778 వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్ను సమీక్షిస్తున్నామని, అన్ని యాక్టివ్ వాణిజ్య రిజిస్టర్ సంస్థలు ఉనికిని నిర్ధారించే క్రమంలో తనిఖీలు చేపట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఈ రెండవ దశ మార్కెట్ సమీక్ష.. గత రెండు దశాబ్దాలలో (2000 నుండి 2020 సంవత్సరాల వరకు) పనిచేయని లేదా గడువు ముగిసిన కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 1970 - 1999 సంవత్సరాల్లో కార్యకలాపాలు నిలిపివేసిన లేదా గడువు ముగిసిన కంపెనీలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన మార్కెట్ సమీక్ష మొదటి దశలో భాగంగా 3,415 వాణిజ్య రిజిస్టర్లను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







