ఒమన్ లో 35వేల కంటే ఎక్కువ వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- April 09, 2025
మస్కట్: వాణిజ్యం, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ.. గడువు ముగిసిన లేదా కార్యకలాపాలను నిలిపివేసిన 35,778 వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్ను సమీక్షిస్తున్నామని, అన్ని యాక్టివ్ వాణిజ్య రిజిస్టర్ సంస్థలు ఉనికిని నిర్ధారించే క్రమంలో తనిఖీలు చేపట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఈ రెండవ దశ మార్కెట్ సమీక్ష.. గత రెండు దశాబ్దాలలో (2000 నుండి 2020 సంవత్సరాల వరకు) పనిచేయని లేదా గడువు ముగిసిన కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 1970 - 1999 సంవత్సరాల్లో కార్యకలాపాలు నిలిపివేసిన లేదా గడువు ముగిసిన కంపెనీలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన మార్కెట్ సమీక్ష మొదటి దశలో భాగంగా 3,415 వాణిజ్య రిజిస్టర్లను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









