బహ్రెయిన్ లో కార్డ్ స్కామ్..BD31,000 చోరీ చేసిన సిస్టర్స్..!!
- April 09, 2025
మనామా: అరబ్ కు చెందిన ఇద్దరు సిస్టర్స్ విజిట్ వీసాలపై బహ్రెయిన్కు వచ్చి చోరీలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. మూడు నెలల్లోనే వారు గల్ఫ్ దేశం నుండి చోరీ చేసిన క్రెడిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి BD31,000 కంటే ఎక్కువ విలువైన 77 మొబైల్ ఫోన్లను ఆర్డర్ చేయడంలో విషయం బయటకు వచ్చింది. వీరితోపాటు ఉన్న మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. అతను హ్యాక్ చేయబడిన బ్యాంక్ కార్డ్ డేటాను ఉపయోగించి ఆర్డర్లు ఇచ్చాడని పేర్కొన్నారు. డెలివరీలన్నీ బహ్రెయిన్లోని సిస్టర్స్ అడ్రస్ కు వెళ్లినట్లు విచారణ సందర్భంగా గుర్తించారు. ఫారీన్ పేమెంట్స్, లోకల్ డెలివరీలు భారీగా ఉండటంతో సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేయగా స్కామ్ వివరాలు వెల్లడయ్యాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఆర్డర్లు సెప్టెంబర్, డిసెంబర్ 2024 మధ్య జరిగాయన్నారు. మొత్తం BD31,081.366 విలువైన వస్తువులను ఆర్డర్ చేసి తెప్పించుకున్నారని పేర్కొన్నారు. జరిగిన నేరాలను నిందితులు అంగీకరించారని తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







