ప్యారిస్‌లో షేక్‌ జాయెద్‌ సెంటర్‌

- July 07, 2016 , by Maagulf
ప్యారిస్‌లో షేక్‌ జాయెద్‌ సెంటర్‌



ఫ్రెంచ్‌ రాజధాని ప్యారిస్‌లోని ముసీ దు లావెరె (లావెరె మ్యూజియం) వద్ద షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ సెంటర్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూఏఈ ఫౌండింగ్‌ ఫాదర్‌కి నివాళులర్పించారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో మీడియా టూల్స్‌ని ఏర్పాటు చేశారు. త్రీడీ ఫిలింస్‌, యానిమేషన్స్‌, మోడల్స్‌ ఇంకా పలు ఆసక్తికరమైన అంశాలున్నాయిక్కడ. ఈ కార్యక్రమానికి మినిస్టర్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ ఫ్రాంకోయిస్‌ హోలాండె, అబుదాబీ టూరిజం అండ్‌ కల్చర్‌ అథారిటీ ఛైర్మన్‌ మొహమ్మద్‌ ఖలీఫా అల్‌ ముబారక్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ ఎఫైర్స్‌ కల్చరల్‌ అడ్వయిజర్‌ జాకి నుసెయిబె, సైఫ్‌ గోబాష్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్‌ అబ్దుల్లా, ప్రెసిడెంట్‌ హోలాండెకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు ఇంకా బలోపేతమవ్వాలని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్ట్‌ సంయుక్తం చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అని హోలాండె చెప్పారు. నెలల వ్యవధిలోనే లావెరె అబుదాబీ మ్యూజియం ప్రారంభమవుతుందని చెప్పారాయన. ఈ మ్యూజియం ప్రపంచానికి సంస్కృతిక సంబంధాల గొప్పతనాన్ని మరింతగా తెలియజేస్తుందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com