హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ షాక్
- April 17, 2025
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల పెంపు రూపంలో ఊహించని భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెట్రో సేవలను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. కోవిడ్-19 సమయంలో ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోవడం వల్ల వచ్చిన నష్టాలు ఇంకా తేరుకోకపోవడంతో, దాదాపు రూ. 6,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు కంపెనీ వెల్లడించింది.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఛార్జీలను పెంచడం
ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఛార్జీలను పెంచడం తప్పనిసరిగా మారిందని ఎల్ అండ్ టీ భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు మెట్రో ఛార్జీలను 44 శాతం పెంచిన నేపథ్యంలో, హైదరాబాద్లో కూడా ఇదే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి పునాది వేస్తూ, సంస్థ ఇటీవల రూ. 59 హాలిడే సేవర్ కార్డు, పీక్ అవర్స్ డిస్కౌంట్లను సైలెంట్గా రద్దు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు త్వరలో ఛార్జీలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్