హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ షాక్
- April 17, 2025
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల పెంపు రూపంలో ఊహించని భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెట్రో సేవలను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. కోవిడ్-19 సమయంలో ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోవడం వల్ల వచ్చిన నష్టాలు ఇంకా తేరుకోకపోవడంతో, దాదాపు రూ. 6,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు కంపెనీ వెల్లడించింది.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఛార్జీలను పెంచడం
ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఛార్జీలను పెంచడం తప్పనిసరిగా మారిందని ఎల్ అండ్ టీ భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు మెట్రో ఛార్జీలను 44 శాతం పెంచిన నేపథ్యంలో, హైదరాబాద్లో కూడా ఇదే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి పునాది వేస్తూ, సంస్థ ఇటీవల రూ. 59 హాలిడే సేవర్ కార్డు, పీక్ అవర్స్ డిస్కౌంట్లను సైలెంట్గా రద్దు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు త్వరలో ఛార్జీలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!









