8 ఏళ్ల ఆటిస్టిక్ బాలికను చంపిన అమ్మమ్మ.. ప్రాసిక్యూషన్ దర్యాప్తు..!!
- April 18, 2025
దుబాయ్: ఎనిమిదేళ్ల ఆటిస్టిక్ బాలిక విషాదకరంగా మరణించిన ఘటనపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తోంది. ఆమె అమ్మమ్మ ఆమెను గొంతు కోసి చంపిందని కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె దుస్తులు మార్చుకోవడానికి సహాయం చేసిన కొద్దిసేపటికే అమ్మమ్మ ఆమె దుస్తులను ఉపయోగించి ఆమెను గొంతు కోసి చంపింది. మసీదు ఇమామ్ అయిన ఆఫ్ఘన్ అమ్మాయి తండ్రి, ఈ సంఘటన జరిగినప్పుడు తాను కొద్దిసేపు ఇంట్లో లేనని పోలీసులకు చెప్పాడు. తిరిగి వచ్చినప్పుడు, తన కుమార్తె కదలకుండా పడి ఉందని, అంబులెన్స్ కోసం కాల్ చేయగా.. పారామెడిక్స్ అమ్మాయి చనిపోయిందని నిర్ధారించారు. ఆమె మెడపై గొంతు ను కోసి చంపిన గుర్తులు స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు.
తన తల్లిదండ్రులను విజిట్ వీసాపై దుబాయ్కు పిలిపించిన తండ్రి, తన తల్లిని అనుమానించాడని, ఎందుకంటే వారు గతంలో బిడ్డను చూసుకునే విషయంలో గొడవలు జరిగాయని తెలిపాడు. దుబాయ్ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణ తర్వాత, ఆ అమ్మాయిని సజీవంగా చూసిన చివరి వ్యక్తి వాళ్ల అమ్మమ్మ అని అధికారులు నిర్ధారించారు. కాగా, అమ్మమ్మ నేరాన్ని అంగీకరించింది. తను అనారోగ్యంతో విసిగిపోయిందని, తన కొడుకు-కోడలిని సంరక్షణ భారం నుండి ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, చికిత్స కోసం బాలికను భారతదేశానికి తీసుకెళ్లాలని ఆమె కుటుంబం ప్రణాళిక వేసుకోవడం గమనార్హం.
తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితురాలిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపారు. కేసును విచారణకు సిద్ధం చేయడానికి అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను చూసుకునేటప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి ఆందోళనలపై మరోసారి చర్చను రేకెత్తించింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







