బహ్రెయిన్ లో ఒడియా సమాజ్ ఉత్కల్ దిబాస..సాంస్కృతిక వైభవం..!!
- April 20, 2025
మనామా: బహ్రెయిన్లోని ఒడియా డయాస్పోరా శక్తివంతమైన సంఘం అయిన బహ్రెయిన్ ఒడియా సమాజ్, 90వ ఉత్కల్ దిబాసను విశేషమైన ఉత్సాహం, వైభవంతో జరుపుకుంది. దాదాపు 100 ఒడియా కుటుంబాలు సహా 300 మందికి పైగా హాజరయ్యారు.
ఈ వేడుకకు బహ్రెయిన్ లోని భారత రాయబారి వినోద్ జాకబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయంత్రం స్టార్ హంగామా అందరినీ ఆకట్టుకుంది. ఒడియా హాస్యనటుడు పాపు పోమ్ పోమ్, ప్రముఖ నేపథ్య గాయని ఆనందితా దాస్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి.
ఒడిశా వారసత్వ గొప్పతనాన్ని తెలిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సమాజ సభ్యులు - పురుషులు, మహిళలు , పిల్లలు - సాంప్రదాయ కోరాపుట్ , సంబల్పురి నృత్య ప్రదర్శనలు, శ్రావ్యమైన ఒడియా పాటలు, "మో ఒడిశా" అనే థీమ్తో కూడిన ఫ్యాషన్ షో అందరని ఆకట్టుకుంది. చివరగా అందరిని ట్రోఫీలు, అవార్డులతో సత్కరించారు.
ఈ కార్యక్రమం బహ్రెయిన్ ఒడియా సమాజ్ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ పాధి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. తరువాత ప్రముఖ ఒడియా పారిశ్రామికవేత్త దేబాలోకనాథ్ మొహంతి, బహ్రెయిన్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ ఈద్ బుఖామాస్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









