బహ్రెయిన్ లో ఒడియా సమాజ్ ఉత్కల్ దిబాస..సాంస్కృతిక వైభవం..!!
- April 20, 2025
మనామా: బహ్రెయిన్లోని ఒడియా డయాస్పోరా శక్తివంతమైన సంఘం అయిన బహ్రెయిన్ ఒడియా సమాజ్, 90వ ఉత్కల్ దిబాసను విశేషమైన ఉత్సాహం, వైభవంతో జరుపుకుంది. దాదాపు 100 ఒడియా కుటుంబాలు సహా 300 మందికి పైగా హాజరయ్యారు.
ఈ వేడుకకు బహ్రెయిన్ లోని భారత రాయబారి వినోద్ జాకబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయంత్రం స్టార్ హంగామా అందరినీ ఆకట్టుకుంది. ఒడియా హాస్యనటుడు పాపు పోమ్ పోమ్, ప్రముఖ నేపథ్య గాయని ఆనందితా దాస్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి.
ఒడిశా వారసత్వ గొప్పతనాన్ని తెలిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సమాజ సభ్యులు - పురుషులు, మహిళలు , పిల్లలు - సాంప్రదాయ కోరాపుట్ , సంబల్పురి నృత్య ప్రదర్శనలు, శ్రావ్యమైన ఒడియా పాటలు, "మో ఒడిశా" అనే థీమ్తో కూడిన ఫ్యాషన్ షో అందరని ఆకట్టుకుంది. చివరగా అందరిని ట్రోఫీలు, అవార్డులతో సత్కరించారు.
ఈ కార్యక్రమం బహ్రెయిన్ ఒడియా సమాజ్ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ పాధి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. తరువాత ప్రముఖ ఒడియా పారిశ్రామికవేత్త దేబాలోకనాథ్ మొహంతి, బహ్రెయిన్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ ఈద్ బుఖామాస్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







