ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- January 15, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో దర్శనం ఇచ్చిన రామ్మోహన్ నాయుడు ను చూసి ప్రధాని మోదీ తో సహా అందరూ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా డిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో బుధవారం నాడు పండుగ వేడుకలు జరిగాయి. తెలుగు, తమిళ సంప్రదాయాలను మిళితం చేస్తూ.. ఆనాటి ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమం సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవ్వగా.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తన సహచర మంత్రులు, ఎంపీలతో కలసి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది పండుగ సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ప్రధాని మోదీని రామ్మోహన్ నాయుడు సత్కరించారు.
అయితే ఎప్పుడూ కోట్ జాకెట్ డ్రెస్సింగ్ విధానాన్ని అవలంభించే రామ్మోహన్ నాయుడు.. అందుకు భిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, ధోవతి వేసుకుని ఈ యువ కేంద్ర మంత్రి దర్శనం ఇచ్చారు. వినూత్నంగా కనిపిస్తున్న రామ్మోహన్ నాయుడును మోదీతో సహా అక్కడున్న వారు చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









