కస్టమర్లకు 'ఎర్రర్' SMS.. క్షమాపణలు చెప్పిన యూఏఈ బ్యాంక్..!!
- April 21, 2025
యూఏఈ: కొంతమంది కస్టమర్లకు 'మోసపూరితంగా' అనిపించిన 'ఎర్రర్' మెసేజులు రావడంతో ఆదివారం యూఏఈ బ్యాంక్ వారికి క్షమాపణలు చెప్పింది.సోషల్ మీడియా ద్వారా పలువురు బ్యాంక్ కస్టమర్లు మెసేజులు వచ్చిన తెలిపారు.ఇవన్నీ ఫ్రాడ్ లా అనిపించాయని ఫిర్యాదులు చేశారు. తాము బ్యాంకుకు కాల్ చేసినా.. దాదాపు గంటసేపు ఎటువంటి స్పందన రాలేదని పలువురు కస్టమర్లు అసహనంవ్యక్తం చేశారు.
"మీ పెద్ద బ్యాంకు కాల్స్కు హాజరు కాగల కస్టమర్ కేర్ ఏజెంట్లు లేరు. 45 నుండి 60 నిమిషాల తర్వాత ఎవరో ఒకరు కాల్కు హాజరై, అది సాంకేతిక లోపం అని చెప్పి క్షమాపణలు చెప్పారు" అని వినియోగదారులు ఆన్లైన్లో రాసుకొచ్చారు. బ్యాంకు సోషల్ మీడియా అకౌంట్ లోఇలాంటి లావాదేవీల భయాల గురించి ఫిర్యాదు చేసే కస్టమర్ల కమెంట్లతో నిండిపోయింది.
'RA DISB MIGRATION' అనే పేరుతో వచ్చిన SMS దాని సిస్టమ్ అప్గ్రేడ్ సమయంలో ఒక లోపం అని బ్యాంక్ స్పష్టం చేసింది. "మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.ఈరోజు మీకు వచ్చిన 'RA DISB MIGRATION' అనే SMS కి సంబంధించినది అయితే, దయచేసి ENBD నుండి వచ్చిన సందేశాన్ని విస్మరించండి. మా సిస్టమ్ అప్గ్రేడ్ సమయంలో అది పొరపాటున పంపబడింది." అని బ్యాంకు క్షమాపణలు చెప్పింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









