ఒమన్ లో ఎంప్లాయర్ సర్వే 2025 ప్రారంభం..!!
- April 21, 2025
మస్కట్:ఒమన్ లో ఎంప్లాయర్స్ సర్వే 2025 ను ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్.. జాతీయ కార్మిక మార్కెట్ లో ఉన్నత విద్య ఫలితాల అనుకూలతను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తుందని, ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ వివిధ ఆర్థిక రంగాలలో అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను గుర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 2018 - 2025 మధ్య ఉన్నత విద్య గ్రాడ్యుయేట్లను నియమించిన వివిధ సంస్థల నుండి సంవత్సరంలో మొదటి ఆరు నెలల (జూన్ 30 వరకు) డేటాను సేకరించనున్నారు.
ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల మంత్రి డాక్టర్ రహమా ఇబ్రహీం అల్ మహ్రౌకి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించడంలో. వాటిని కార్మిక మార్కెట్ అవసరాలకు అనుసంధానించడంలో ఇది కీలకంగా నిలుస్తుందని అన్నారు. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ పోటీతత్వాన్ని పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







