ఒమన్ లో ఎంప్లాయర్ సర్వే 2025 ప్రారంభం..!!
- April 21, 2025
మస్కట్:ఒమన్ లో ఎంప్లాయర్స్ సర్వే 2025 ను ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్.. జాతీయ కార్మిక మార్కెట్ లో ఉన్నత విద్య ఫలితాల అనుకూలతను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తుందని, ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ వివిధ ఆర్థిక రంగాలలో అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను గుర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 2018 - 2025 మధ్య ఉన్నత విద్య గ్రాడ్యుయేట్లను నియమించిన వివిధ సంస్థల నుండి సంవత్సరంలో మొదటి ఆరు నెలల (జూన్ 30 వరకు) డేటాను సేకరించనున్నారు.
ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల మంత్రి డాక్టర్ రహమా ఇబ్రహీం అల్ మహ్రౌకి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించడంలో. వాటిని కార్మిక మార్కెట్ అవసరాలకు అనుసంధానించడంలో ఇది కీలకంగా నిలుస్తుందని అన్నారు. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ పోటీతత్వాన్ని పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









