ఏపీ: విద్యార్థులకు గుడ్న్యూస్..
- April 22, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యార్థులకు గుడ్న్యూస్.ఈ సారి 48 రోజులు సమ్మర్ హాలీడేస్ ఉండనున్నాయి. ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చింది. పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయి. అన్ని స్కూళ్లకు బుధవారం ఈ ఏడాది చివరి పని దినం కానుంది.
వేసవి సెలవుల్లో ఇలా గడపండి
సమ్మర్ హాలీడేస్లో పాఠశాల పిల్లలు సమయాన్ని సరదాగానూ గడపాలి, అలాగే, మీ నాలెడ్జ్ను పెంచుకునేలానూ గడపాలి. ఇందుకోసం తల్లిదండ్రులు ఓ ప్రణాళిక చేసుకోవడం చాలా మంచిది. చదువులో పిల్లల అభిరుచి పెంచేందుకు కథలు, బాల పత్రికలు, కార్టూన్ బుక్స్ చదివించాలి.
స్థానిక గ్రంథాలయాల వద్దకు పిల్లలను తీసుకెళ్లాలి. కొత్త పదాలు నేర్చుకోవడం, కథలు రాయడం వంటిని నేర్చుకునేలా చేయాలి. చిత్రలేఖనం, మట్టి బొమ్మలు, క్రాఫ్ట్ పనులు వంటివి నేర్పించవచ్చు. పజిల్స్, సుడోకు, చెస్ వంటిని మీ పిల్లల తెలివితేటలను, సమయస్ఫూర్తిని పెంచుతాయి.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









