ఏపీ: విద్యార్థులకు గుడ్న్యూస్..
- April 22, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యార్థులకు గుడ్న్యూస్.ఈ సారి 48 రోజులు సమ్మర్ హాలీడేస్ ఉండనున్నాయి. ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చింది. పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయి. అన్ని స్కూళ్లకు బుధవారం ఈ ఏడాది చివరి పని దినం కానుంది.
వేసవి సెలవుల్లో ఇలా గడపండి
సమ్మర్ హాలీడేస్లో పాఠశాల పిల్లలు సమయాన్ని సరదాగానూ గడపాలి, అలాగే, మీ నాలెడ్జ్ను పెంచుకునేలానూ గడపాలి. ఇందుకోసం తల్లిదండ్రులు ఓ ప్రణాళిక చేసుకోవడం చాలా మంచిది. చదువులో పిల్లల అభిరుచి పెంచేందుకు కథలు, బాల పత్రికలు, కార్టూన్ బుక్స్ చదివించాలి.
స్థానిక గ్రంథాలయాల వద్దకు పిల్లలను తీసుకెళ్లాలి. కొత్త పదాలు నేర్చుకోవడం, కథలు రాయడం వంటిని నేర్చుకునేలా చేయాలి. చిత్రలేఖనం, మట్టి బొమ్మలు, క్రాఫ్ట్ పనులు వంటివి నేర్పించవచ్చు. పజిల్స్, సుడోకు, చెస్ వంటిని మీ పిల్లల తెలివితేటలను, సమయస్ఫూర్తిని పెంచుతాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!







