ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణకాండ కొనసాగుతోంది
- July 07, 2016
ఇరాక్: ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణకాండ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఆత్మాహుతి దాడులతో ఉత్తర బాగ్దాద్ ప్రాంతంలో మరోసారి బీభత్సం సృష్టించారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు, పేలుళ్లకు పాల్పడ్డారు.
ఓ ప్రార్థనా మందిరం వద్ద ముష్కరులు వరుస ఆత్మాహుతి పేలుళ్లు, కాల్పులలకు పాల్పడటంతో 35 మంది మృతిచెందారు. ఈ పేలుళ్లలో మరో 60మందికి పైగా గాయపడ్డారు.
ఐఎస్ ఆత్మాహుది దాడులు: 213మంది మృతి
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. తొలుత విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, అనంతరం బెల్టుబాబులతో ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు.
కాగా, ఐదు రోజుల క్రితం బాగ్దాద్లో ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 292 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







