అల్ హజియత్ అగ్నిప్రమాదంలో విషాదం..తల్లి, కొడుకు మృతి..!!
- April 23, 2025
మనామా: అల్ హజియత్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సంభవించిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో బాల్కనీ నుండి పడి 30 ఏళ్ల ప్రత్యేక అవసరాలు గల వ్యక్తి, అతని 48 ఏళ్ల తల్లి ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది అంతస్తుల నివాస భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు చేపట్టారు. పొగ పీల్చడం వల్ల ఒక అస్వస్థతకు గురైన పిల్లవాడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









