అల్ హజియత్ అగ్నిప్రమాదంలో విషాదం..తల్లి, కొడుకు మృతి..!!
- April 23, 2025
మనామా: అల్ హజియత్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సంభవించిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో బాల్కనీ నుండి పడి 30 ఏళ్ల ప్రత్యేక అవసరాలు గల వ్యక్తి, అతని 48 ఏళ్ల తల్లి ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది అంతస్తుల నివాస భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు చేపట్టారు. పొగ పీల్చడం వల్ల ఒక అస్వస్థతకు గురైన పిల్లవాడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!







